Indore: ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలయ్యింది. కోహ్లీ అద్భుతమైన సెంచరీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది.
చెలరేగిన న్యూజిలాండ్ బ్యాట్స్మెన్
న్యూజిలాండ్ మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది . టీమిండియా బౌలర్లు మొదట కొంత మేరకు న్యూజిలాండ్ బ్యాటర్స్ ని కట్టడి చేసినా కివీస్ బ్యాట్స్మెన్ మ్యాచ్ ని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకున్నారు.
డారెల్ మిచెల్ (137)
గ్లెన్ ఫిలిప్స్ (106)
వీరిద్దరి వీరోచితమైన ఇన్నింగ్స్ తో కివీస్ 337/8 భారీ స్కోర్ చేసింది.
ఛేజింగ్ లో కుప్పకూలిన టాప్ ఆర్డర్
338 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించాలని బరిలోకి దిగిన భారత్ కు దెబ్బ మీద దెబ్బ తగిలింది.టాప్ ఆర్డర్ తొందరగానే పెవిలియన్ దారిపట్టింది.
కానీ…. కోహ్లీ మాత్రం పోరాడుతూ వున్నాడు.
పోరాడిన కింగ్ కోహ్లీ
విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం టీమిండియాకు విజయాన్ని అందించలేకపోయింది.
కోహ్లీ సెంచరీ వృథా!
తీవ్రమైన ఒత్తిడిలో కూడా నియంత్రణ కోల్పోకుండా 124 పరుగులు చేసి ఔటయ్యాడు
తీవ్రమైన ఒత్తిడిలో కూడా నియంత్రణ కోల్పోకుండా 124 పరుగులు చేసి ఔటయ్యాడు
నితీష్ రెడ్డి (53) హర్షిత్ రానా (52) పరుగులతో కొంత సపోర్ట్ ఇచ్చినా విజయానికి అది సరిపోలేదు
296 పరుగులకే ఆల్ అవుట్ అయిన భారత్
41 పరుగులతో ఓటమి

చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్
- ఈ గెలుపుతో న్యూజిలాండ్ 2–1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.
- భారత గడ్డపై మొదటిసారి వన్డే సిరీస్ గెలిచిన జట్టుగా రికార్డ్ సృష్టించింది.
భారత్కు ఈ ఫలితం గుణపాఠం
ఈ మ్యాచ్ టీమ్ ఇండియాకు కొన్ని ప్రశ్నలు ముందుంచింది :
- మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ఫెయిల్యూర్
- ఒత్తిడి సమయంలో కూలిపోతున్న బ్యాటింగ్
మ్యాచ్ లో అద్భుతమైన సన్నివేశాలు
జడేజా అద్భుతమైన క్యాచ్
కోహ్లీ సెంచరీ
